పెళ్లైన 15 రోజులకే భర్తకు షాకిచ్చిన భార్య.. ఏం చేసిందో తెలిస్తే షాకవ్వాల్సిందే?

పెళ్లైన పదిహేను రోజులకే భార్య తన భర్తకు బిగ్ షాకిచ్చింది. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మండలం రాచపల్లి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

Update: 2024-10-03 14:26 GMT

దిశ,వెబ్‌డెస్క్: పెళ్లైన పదిహేను రోజులకే భార్య తన భర్తకు బిగ్ షాకిచ్చింది. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మండలం రాచపల్లి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. భీమవరంలో పెళ్లి చేసుకున్న అతను తన భార్యను తన స్వగ్రామానికి తీసుకొచ్చాడు. అయితే ఆమె పెళ్లి అయిన తర్వాత అత్తారింట్లో కేవలం 15 రోజులు మాత్రమే ఉంది. ఆ తర్వాత భర్తతో కాపురం చేయడానికి నిరాకరించిన భార్య.. తన తల్లిదండ్రులకు ఆరోగ్యం బాగాలేదని వెంటనే భీమవరం తీసుకెళ్లాలని భర్తతో పోరు పెట్టుకుంది. ఆమె మాటలు నమ్మిన భర్త తనను తీసుకుని రైలు ఎక్కారు. ఈ క్రమంలోనే ఆమె అతనికి భారీ షాక్ ఇచ్చింది. తాను ఇంట్లో చెప్పి పెళ్లి చేసుకోలేదని.. సదరు భర్తకు మస్కా కొట్టి ఉడాయించింది. దీంతో కంగుతిన్న భర్త వెంటనే ఆమెకు పలుమార్లు ఫోన్ చేయగా స్విచ్‌ఆఫ్ రావడంతో తాము మోసపోయినట్లు గమనించాడు. భీమవరం తీసుకెళ్లకపోతే ఆత్మహత్య చేసుకుంటానని నా భార్య బెదిరించిందని బాధితుడు వాపోయాడు. ఈ నేపథ్యంలో అతను తనను మోసం చేసిన భార్యతో పాటు, మ్యారేజ్ బ్రోకర్‌పై హిందూపురం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.


Similar News