Ashes Series: తొలి వన్డే ఇంగ్లండ్దే.. ఆసీస్పై విజయం
మూడు వన్డే సిరీస్లో భాగంగా ఆసీస్తో జరుగుతున్న మ్యాచ్లో 2 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ విజయం సాధించింది.
దిశ, వెబ్డెస్క్: మూడు వన్డే సిరీస్లో భాగంగా ఆసీస్తో జరుగుతున్న మ్యాచ్లో 2 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ విజయం సాధించింది. తొలి వన్డే నెగ్గి 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. తొలి వన్డేలో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఆసీస్.. బెత్ మూనీ (81 నాటౌట్), ఎల్లీస్ పెర్రీ (41), ఫోబ్ లిచ్ఫీల్డ్ (34), జొనాస్సెన్ (30) రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 263 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బౌలర్లలో.. లారెన్ బెల్, నాట్ సీవర్ బ్రంట్ చెరో 2 వికెట్లు.. కేట్ క్రాస్, ఎక్లెస్టోన్, సారా గ్లెన్, అలైస్ క్యాప్సీ తలో వికెట్ పడగొట్టారు.
అనంతరం బరిలోకి దిగిన ఇంగ్లండ్.. హీథర్ నైట్ 75 నాటౌట్గా నిలిచింది. మిగిలిన బ్యాటర్స్లో ట్యామీ బేమౌంట్ (47), అలైస్ క్యాప్సీ (40), నాట్ సీవర్ బ్రంట్ (31) రాణించడంతో 48.1 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. ఆసీస్ బౌలర్లలో.. ఆష్లే గార్డ్నర్ 3, జార్జియా వేర్హమ్ 2, ఎల్లైస్ పెర్రీ, మెగాన్ షట్, జెస్ జోనాస్సెన్ తలో వికెట్ దక్కించుకున్నారు. ఇరు జట్ల మధ్య రెండో వన్డే జులై 16న జరుగనుంది.