బ్రిటన్లో చైనా గూఢచర్యం భయాలు : రిషి సునాక్
బ్రిటన్లో చైనా గూఢచర్యంపై ఆ దేశ ప్రధాని రిషి సునాక్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
లండన్ : బ్రిటన్లో చైనా గూఢచర్యంపై ఆ దేశ ప్రధాని రిషి సునాక్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీ వేదికగా జరిగిన జీ20 సదస్సు సందర్భంగా ఈ విషయాన్ని చైనా ప్రధానమంత్రి లీ కియాంగ్ దృష్టికి ఆయన తీసుకెళ్లారు. బ్రిటన్ ఎంపీలతో పరిచయాలు పెంచుకున్న ఇద్దరు చైనా గూఢచారులు ఇటీవల లండన్లో అరెస్టయిన అంశాన్ని రిషి వివరించారు. వీరిలో ఓ గూఢచారి ఏకంగా బ్రిటన్ పార్లమెంటులోనే పనిచేస్తున్నట్టు దర్యాప్తులో తేలిందనిబ్రిటన్లో చైనా గూఢచర్యం భయాలు : రిషి సునాక్తెలిపారు. అయితే దీనిపై చైనా ప్రధాని ఎలా స్పందించారో తెలియరాలేదు. ఇక జీ20 సదస్సుకు రష్యా ప్రెసిడెంట్ పుతిన్ హాజరుకాకపోవడంపై రిషి సునాక్ అసహనం వ్యక్తం చేశారు. ముఖం చూపించుకోలేకే పుతిన్ ఈ సదస్సుకు రాలేదని మండిపడ్డారు.