రెండు రోజుల వ్యవధిలోనే ముగ్గురు టీమిండియా స్టార్ క్రికెటర్స్ రిటైర్మెంట్.. భారత క్రికెట్లో భారీ కుదుపు..!
140 కోట్ల మంది ప్రజల ఆకాంక్షను నిజం చేస్తూ టీ-20 వరల్డ్ కప్ విజేతగా టీమిండియా నిలిచింది. వెస్టిండీస్లోని బ్రిడ్జిటౌన్ వేదికగా శనివారం
దిశ, వెబ్డెస్క్: 140 కోట్ల మంది ప్రజల ఆకాంక్షను నిజం చేస్తూ టీ-20 వరల్డ్ కప్ విజేతగా టీమిండియా నిలిచింది. వెస్టిండీస్లోని బ్రిడ్జిటౌన్ వేదికగా శనివారం సౌతాఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్లో విజయం సాధించి భారత్ విశ్వవిజేతగా అవతరించింది. తద్వారా 17 ఏళ్ల తర్వాత పొట్టి ప్రపంచ కప్ను టీమిండియా ముద్దాడింది. భారత్ విశ్వవిజేతగా నిలువడంతో దేశవ్యాప్తంగా అభిమానులు పెద్ద ఎత్తున సంబురాలు చేసుకున్నారు. క్రికెట్ ప్రియులంతా టీమిండియా కొన్ని ఏండ్ల తర్వాత కప్ కొట్టడంతో ఫుల్ జోష్లో ఉన్న వేళ భారత స్టార్ క్రికెటర్స్ ఫ్యాన్స్కు బిగ్ షాక్ ఇచ్చారు. భారత్ టీ20 వరల్డ్ కప్ గెలిచిన అనంతరం స్టార్ ప్లేయర్స్ విరాట్ కోహ్లీ, కెప్టెన్ రోహిత్ శర్మ పొట్టి ఫార్మాట్కు రిటైర్మెంట్ ప్రకటించారు.
కోహ్లీ, రోహిత్ టీ20 ఫార్మాట్కు వీడ్కోలు పలకడంతో ఇద్దరి అభిమానులు తీవ్ర నిరాశలో మునిగిపోయారు. ఇదిలా ఉండగానే మరో టీమిండియా స్టార్ ప్లేయర్ రవీంద్ర జడేజా సైతం వీరి బాటలోనే పయనించాడు. కోహ్లీ, రోహిత్ మాదిరిగానే టీ-20 ఫార్మాట్కు జడేజా రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా జడేజా ఆదివారం వెల్లడించాడు. ఇప్పటి వరకు అత్యుత్తమమైన ఆటను దేశానికి అందించానని, టీ-20 వరల్డ్ కప్ గెలవడంతో తన కల నేరవేరిందని సందర్భంగా సందర్భంగా జడేజా పేర్కొన్నాడు. టీ-20 ఫార్మాట్కు మాత్రమే రిటైర్మెంట్ ప్రకటించానని.. భారత్ తరఫున వన్డే, టెస్టులు ఆడుతానని ఈ సందర్భంగా జడ్డూ క్లారిటీ ఇచ్చాడు.
కాగా, ఇప్పటి వరకు భారత్ తరుఫున 74 అంతర్జాతీయ టీ20 మ్యాచ్లు ఆడిన జడ్డూ.. 515 పరుగులు చేసి.. 54 వికెట్లు తీశాడు. తన బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్తో ఎన్నో మ్యాచుల్లో జడేజా టీమిండియాకు అద్భుత విజయాలను అందించాడు. కాగా, జడేజా రిటైర్మెంట్తో రెండు రోజుల వ్యవధిలోనే భారత్కు ముగ్గురు స్టార్ ప్లేయర్స్ గుడ్ బై చెప్పారు. ఓ వైపు టీమిండియా కప్ గెలించిందని ఆనందంలో ఉన్న ఫ్యాన్స్కు.. తమ అభిమాన ఆటగాళ్ల రిటైర్మెంట్ వార్త మరింత బాధను మిగిల్చింది. కేవలం రెండు రోజుల వ్యవధిలోనే అంతర్జాతీయ టీ-20 ఫార్మాట్కు కోహ్లీ, రోహిత్, జడేజా వంటి స్టార్ ప్లేయర్స్ వీడ్కోలు పలకడం టీమిండియాకు ఎదురుదెబ్బేనని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.