భారీ ఆధిక్యం దిశగా టీమ్ ఇండియా..

డొమినికా టెస్టులో మూడో రోజు లంచ్ బ్రేక్ సమయానికి టీమిండియా 4 వికెట్ల నష్టానికి 400 పరుగుల స్కోరు చేసింది.

Update: 2023-07-14 16:41 GMT

దిశ, వెబ్‌డెస్క్: డొమినికా టెస్టులో మూడో రోజు లంచ్ బ్రేక్ సమయానికి టీమిండియా 4 వికెట్ల నష్టానికి 400 పరుగుల స్కోరు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో 150 పరుగులకి ఆలౌట్ అయిన ఆతిథ్య వెస్టిండీస్‌పై ఇప్పటికే 250 పరుగుల ఆధిక్యంలో ఉంది. మరో సెషన్‌ బ్యాటింగ్ చేసి.. ఇన్నింగ్స్ డిక్లేర్ చేసే అవకాశం ఉంది. ఓవర్‌నైట్ స్కోరు 312/2 వద్ద మూడో రోజు బ్యాటింగ్ మొదలెట్టిన టీమిండియా.. యశస్వి జైస్వాల్ (171) పరుగులు చేసి ఔట్ అయ్యాడు. లంచ్ బ్రేక్ సమయానికి విరాట్ కోహ్లీ (72), రవీంద్ర జడేజా(21) పరుగులతో క్రీజులో ఉన్నారు.


Similar News