పారిస్ పారాలింపిక్స్‌కు తైక్వాండో క్రీడాకారిణి అరుణ అర్హత

పారిస్ పారాలింపిక్స్‌కు భారత తైక్వాండో క్రీడాకారిణి అరుణ తన్వార్ అర్హత సాధించింది.

Update: 2024-03-17 16:38 GMT

దిశ, స్పోర్ట్స్ : ఈ ఏడాది జరగబోయే పారిస్ పారాలింపిక్స్‌కు భారత తైక్వాండో క్రీడాకారిణి అరుణ తన్వార్ అర్హత సాధించింది. చైనాలో ఆదివారం జరిగిన ఏషియన్ పారాలింపిక్స్ క్వాలిఫయర్ టోర్నీలో అరుణ 47 కేజీ కేటగిరీలో స్వర్ణ పతకం సాధించింది. దీంతో పారాలింపిక్స్ బెర్త్‌ను ఖాయం చేసుకున్న ఆమె.. పారాలింపిక్స్‌లో పాల్గొనడం ఇది వరుసగా రెండోసారి కానుంది. టోక్యో పారాలింపిక్స్‌లో అరుణ్ ప్రాతినిధ్యం వహించడంతో పారాలింపిక్స్‌కు అర్హత సాధించిన తొలి భారత తైక్వాండో క్రీడాకారిణి రికార్డు నెలకొల్పింది. గతేడాది ఏషియన్ పారా గేమ్స్‌లో అరుణ కాంస్య పతకం సాధించింది. 

Tags:    

Similar News