సూర్యకుమార్‌ హాఫ్‌ సెంచరీ.. విండీస్ టార్గెట్ ఇదే

Update: 2023-08-13 16:47 GMT

దిశ, వెబ్‌డెస్క్: విండీస్‌తో జరుగుతున్న ఐదో టీ20లో భారత్ బ్యాటింగ్‌ పూర్తయింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. ఓపెనర్లు శుభ్‌మన్‌ గిల్ (9), యశస్వి జైస్వాల్ (5) నిరాశపర్చగా.. సూర్యకుమార్‌ యాదవ్ (61; 45 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) హాఫ్ సెంచరీ బాది భారత్‌ను ఆదుకున్నాడు. తిలక్‌ వర్మ (27; 18 బంతుల్లో) ఫర్వాలేదనిపించాడు. సంజు శాంసన్‌ (13), హార్దిక్ పాండ్య (14) తక్కువ స్కోరుకే పెవిలియన్‌ చేరారు. విండీస్ బౌలర్లలో రొమారియో షెఫర్డ్ 4, అకీల్ హోసీన్‌ 2, జేసన్ హోల్డర్ 2, రోస్టన్ చేజ్ వికెట్ పడగొట్టారు.


Similar News