రెండో వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్

బెంగుళూరు వేదికగా టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ లో న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ లో రెండో వికెట్ కోల్పోయింది.

Update: 2024-10-17 11:04 GMT

దిశ, వెబ్ డెస్క్ : బెంగుళూరు వేదికగా టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ లో న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ లో రెండో వికెట్ కోల్పోయింది. జడేజా తన ఐదో ఓవర్ లో కివీస్ బ్యాటర్ యంగ్ 33ను అవుట్ చేశాడు. యంగ్ 73బాల్స్ ఎదుర్కోని 33పరుగులు సాధించి జడేజా బౌలింగ్ లో కుల్ధీప్ యాదవ్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. మరో ఓపెనర్ డెవిడ్ కాన్వే(89) సెంచరీ దిశగా సాగుతున్నాడు. రవీంద్ర (1)పరుగులలో క్రీజ్ లో ఉన్నారు. ప్రస్తుతం న్యూజిలాండ్ తన తొలి ఇన్నింగ్స్ లో 37ఓవర్లకు రెండు వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. టీమిండియాపై 97పరుగుల ఆధిక్యత సాధించింది. కివీస్ తొలి వికెట్ గా కెప్టన్, ఓపెనర్ టామ్ లాథమ్ 15 పరుగులు చేసి కుల్ధీప్ యాదవ్ బౌలింగ్ లో అవుటయ్యాడు. అంతకుముందు టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 31.2ఓవర్లలో 46పరుగుల స్వల్ప స్కోరుకే ఆలౌట్ అయ్యింది. 


Similar News