Bangalore Test: టీమిండియా ఎదుట కివీస్ భారీ టార్గెట్

ఇండియా(Team India)తో తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్(New Zealand) జట్టు 420 పరుగులకు ఆలౌట్ అయింది.

Update: 2024-10-18 08:37 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఇండియా(Team India)తో తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్(New Zealand) జట్టు 420 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో భారత్‌పై 356 పరుగుల ఆధిక్యత సాధించింది. కివీస్ బ్యాటర్లలో రచిన్ రవీంద్ర 134, కాన్వే 91, టిమ్ సౌథి 65, విల్ యంగ్ 33 పరుగులు చేసి రాణించారు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్‌లు చెరో మూడు వికెట్లు తీశారు. మహ్మద్ సిరాజ్, రవిచంద్రన్ అశ్విన్‌, జస్ప్రీత్ బూమ్రాలు తలో రెండేసి వికెట్లు పడగొట్టారు. టీమిండియా ఫస్ట్ ఇన్సింగ్స్‌లో కేవలం 46 పరుగులకే కుప్పకూలిన విషయం తెలిసిందే. ఇంకా రెండు రోజుల ఆట మిగిలి ఉండటంతో భారత్ చెమటోడ్చి కష్టపడాల్సిన పరిస్థితి ఏర్పడింది.


Similar News