‘స్కై’ హాఫ్‌ సెంచరీ.. ఆటకు వర్షం అంతరాయం..

Update: 2023-08-13 16:27 GMT

దిశ, వెబ్‌డెస్క్: వెస్టిండీస్ టూర్‌లో ఆఖరి టీ20 మ్యాచ్‌‌కి వర్షం అంతరాయం కలిగించింది. అల్జారీ జోసెఫ్‌ వేసిన 16వ ఓవర్లో తొలి బంతికి సూర్యకుమార్‌ యాదవ్‌ సిక్స్ బాది అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. ఇదే ఓవర్‌లో ఫుల్‌ టాస్‌గా వచ్చిన నాలుగో బంతిని హార్దిక్ పాండ్య నేరుగా ఆడగా.. బౌలర్ జోసెప్‌ క్యాచ్‌ అందుకోలేకపోయాడు. 15.5 ఓవర్ల ఆట పూర్తయిన తర్వాత చిరుజల్లు కురవడంతో మ్యాచ్‌ను నిలిపి వేశారు. అప్పటికి భారత్ స్కోరు 121/4. సూర్యకుమార్ (53), హార్దిక్ (8) పరుగులతో ఉన్నారు.


Similar News