దిశ, వెబ్డెస్క్: ఐసీసీ ఛాంపియన్షిప్లో భాగంగా టీమ్ ఇండియా, బంగ్లాదేశ్ మహిళల జట్ల మధ్య జరిగిన రెండో మ్యాచ్లో భారత్ ఘన విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్1-1తో సమం అయ్యింది. బంగ్లాదేశ్పై రెండో వన్డేలో 108 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన టీమ్ఇండియా నిర్ణిత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది.
అనంతరం బంగ్లాదేశ్ జట్టును 120 పరుగులకే ఆలౌట్ చేసింది. జెమిమా రోడ్రిగ్స్ తన ఆల్రౌండ్ ప్రదర్శన (86 పరుగులు, 4 వికెట్లు)తో బంగ్లాదేశ్ పతనాన్ని శాసించింది. దేవికా వైద్య 3, మేఘన సింగ్, దీప్తీ శర్మ, స్నేహ్రానా తలో వికెట్తీశారు. ఇక ఈ విజయంతో మూడు మ్యాచ్ల సిరీస్ను హర్మన్ సేన 1-1తో సమం చేసింది. శనివారం ఇరుజట్ల మధ్య సిరీస్ డిసైడర్ మూడో మ్యాచ్ జరగనుంది.