ఎమెర్జింగ్ ఆసియాకప్ లో యూఏఈపై భారత్ ఏ ఘన విజయం
ఎమర్జింగ్ ఆసియా కప్లో భారత ఏ జట్టు వరుసగా రెండో విజయం సాధించింది.
దిశ, వెబ్ డెస్క్ : ఎమర్జింగ్ ఆసియా కప్లో భారత ఏ జట్టు వరుసగా రెండో విజయం సాధించింది. తొలి పోరులో పాకిస్థాన్ను చిత్తుగా ఓడించిన టీమిండియా.. సోమవారం యూఏఈపై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన యూఏఈ 16.5 ఓవర్లలో 107 పరుగులకే ఆల్ ఔట్ కాగా.. తర్వాత బ్యాటింగ్ కు దిగిన భారత్ 10.5 ఓవర్లలోనే 3 వికెట్ల నష్టానికి లక్ష్యాన్ని చేధించి, గెలుపొందింది. ఈ మ్యాచ్ లో అభిషేక్ శర్మ 58 పరుగులు చేయగా.. కెప్టెన్ తిలక్ వర్మ 21 పరుగులు చేశాడు. ఈ విజయంతో టీమిండియా 4 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. భారత్ నెక్స్ట్ మ్యాచ్ ఒమన్ తో బుధవారం ఉంది.