Asian Games 2023: బంగ్లాదేశ్‌పై భారత్‌ విజయం.. నాకౌట్‌ ఆశలు సజీవం

Update: 2023-09-21 13:03 GMT

దిశ, వెబ్‌డెస్క్: చైనాలోని హాంగ్‌ఝౌ వేదికగా జరుగుతున్న ఏషియన్‌ గేమ్స్‌ 2023 పురుషుల ఫుట్‌బాల్‌ ఈవెంట్‌లో భారత్‌ బోణీ కొట్టింది. రౌండ్‌ ఆఫ్‌ 16కు (నాకౌట్‌) చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో టీమిండియా.. బంగ్లాదేశ్‌పై 1-0 గోల్స్‌ తేడాతో విజయం సాధించింది. హోరాహోరీగా సాగిన ఈ పోరులో భారత కెప్టెన్‌ సునీల్‌ ఛెత్రీ 85వ నిమిషంలో పెనాల్టీ షూటౌట్‌లో గోల్‌ కొట్టి భారత్‌ను గెలిపించాడు.

తొలి మ్యాచ్‌లో ఆతిథ్య చైనా చేతిలో 1-5 గోల్స్‌ తేడాతో ఓడి, నాకౌట్‌ అవకాశాలను సంక్లిష్టం చేసుకున్న భారత్‌.. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో శక్తివంచన లేకుండా పోరాడి బంగ్లాదేశ్‌ను మట్టికరిపించింది. ఈ గెలుపుతో భారత్‌ గ్రూప్‌-ఏలో చైనా, మయన్మార్‌లతో సమానంగా 3 పాయింట్లు సాధించి, పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచింది. సెప్టెంబ‌ర్ 24న మ‌య‌న్మార్‌తో జరిగే మ్యాచ్‌లో గెలిస్తే భారత్‌ నేరుగా రౌండ్‌ ఆఫ్‌ 16కు అర్హత సాధిస్తుంది.


Similar News