Rohit Sharma: రోహిత్ శర్మ అరుదైన రికార్డు..
వెస్టిండీస్తో తొలి టెస్టు సందర్భంగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన మైలురాయిని అందుకున్నాడు.
దిశ, వెబ్డెస్క్: వెస్టిండీస్తో తొలి టెస్టు సందర్భంగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన మైలురాయిని అందుకున్నాడు. టెస్టు ఫార్మాట్లో 3,500 పరుగుల మార్కును అందుకున్నాడు. ఈ మ్యాచ్లో హిట్మ్యాన్ సైతం సెంచరీతో సత్తా చాటాడు. 221 బంతుల్లో 103 పరుగులు సాధించాడు. రోహిత్కు టెస్టుల్లో ఇది పదో సెంచరీ. ఈ క్రమంలో రోహిత్ టెస్టుల్లో 3,500 పరుగులు పూర్తి చేసుకున్నాడు.
మూడు ఫార్మాట్లలో ఈ ఘనతను సాధించిన రెండవ బ్యాటర్గా హిట్మ్యాన్ నిలిచాడు. రన్మెషీన్ విరాట్ కోహ్లి తర్వాత ఈ ఘనత సాధించి రికార్డుల్లోకెక్కాడు. అదే విధంగా.. టీమిండియా తరఫున టెస్టుల్లో 3,500 పరుగుల మార్కును అందుకున్న 20వ బ్యాటర్గా నిలిచాడు. హిట్మ్యాన్ ఇప్పటి వరకు 51 టెస్టులు ఆడగా.. 3,540 పరుగులు సాధించాడు. ఇందులో 10 సెంచరీలు, 1 ద్విశతకం, 14 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
Milestone 🔓 - 3500 Test runs and counting for @ImRo45! #WIvIND pic.twitter.com/W3T7g9HNY8
— BCCI (@BCCI) July 13, 2023