దిశ, వెబ్డెస్క్: క్రికెట్కు ఫ్యాన్ఫాలోయింగ్ ఎక్కువ. ఎప్పటికప్పుడు టీమ్ గురించి న్యూస్ తెలుసుకోవడంతోపాటు తెర వెనుక ఏం జరుగుతుంది? ఆటగాళ్లు ఏం చేస్తుంటారు? వంటి విషయాలను తెలుసుకోవడానికి ఫ్యాన్స్ ఆసక్తి చూపిస్తారు. ఏ మ్యాచ్ జరిగినా టీవీలకు, ఫోన్లకు అతుక్కుపోయి మరీ చూస్తారు. అలాంటి అభిమానుల కోసం ఓ గుడ్న్యూస్. టీమిండియా ఇప్పుడు వాట్సాప్ ఛానెల్స్లోకి వచ్చింది. తాజా అప్డేట్స్, ఎక్స్క్లూజివ్ ఫొటోలు, తెర వెనుక జరిగే కంటెంట్ను తెలుసుకోవాలనుకుంటే ఇకపై వాట్సాప్ను ఫాలో అయితే సరిపోతుంది.
ఇప్పటికే ఇండియన్ టీమ్ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ అయిన ఎక్స్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లలో ఉంది. ఇప్పుడు వాట్సాప్లోకి రావడంతో ఫ్యాన్స్ ఖుష్ అవుతున్నారు. వాట్సాప్ ఛానెల్ ద్వారా ఇండియన్ క్రికెట్ టీమ్ అభిమానులకు మరింత చేరువైందని చెప్పొచ్చు. ఈ ఛానెల్ను ఫాలో అయ్యే అభిమానులకు ఎప్పటికప్పుడు టీమ్కు సంబంధించిన న్యూస్ అందుతుంది. నేరుగా వాళ్ల ఫోన్కే ఈ సమాచారం రావడాన్ని అభిమానులు ఎంజాయ్ చేస్తారనడంలో ఎటువంటి సందేహం లేదు. వరల్డ్ కప్కు ముందు ఇండియన్ టీమ్ ఫ్యాన్స్కు ఈ వాట్సాప్ ఛానెల్స్ గుడ్ న్యూస్ అందించాయి.