మహిళల క్రికెట్‌ జట్లకు ఐసీసీ గుడ్ న్యూస్‌..

మహిళల క్రికెట్‌ జట్లకు ఐసీసీ గుడ్ న్యూస్‌ చెప్పింది.

Update: 2023-07-13 15:17 GMT

దిశ, వెబ్‌డెస్క్: మహిళల క్రికెట్‌ జట్లకు ఐసీసీ గుడ్ న్యూస్‌ చెప్పింది. ఐసీసీ నిర్వహించే అన్ని ఈవెంట్లలో ప్రైజ్‌ మనీ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఐసీసీ ఈవెంట్లలో పురుష క్రికెట్‌ జట్లు, మహిళల క్రికెట్‌ జట్లకు సమానంగా ప్రైజ్‌ మనీ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. అంతేకాకుండా టెస్ట్‌ క్రికెట్‌లో విధించే ఓవర్‌ రేట్‌ ఆంక్షల్లో కూడా మార్పులు చేసింది. దక్షిణాఫ్రికాలోని డర్బన్‌లో జరిగిన ఐసీసీ వార్షిక కాన్ఫరెన్స్‌లో ఈ నిర్ణయం తీసుకుంది. ఐసీసీ ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు బీసీసీఐ సెక్రెటరీ జైషా ప్రకటిస్తూ ట్విట్ చేశారు.


Similar News