దిశ, వెబ్డెస్క్: ఏసీసీ మెన్స్ ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్-2023లో భాగంగా పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో భారత-ఏ జట్టు బౌలర్లు అద్భుతంగా రాణించారు. యువ పేసర్ రాజ్వర్ధన్ హంగర్గేకర్ ఏకంగా 5 వికెట్లతో చెలరేగగా.. స్పిన్నర్ మానవ్ సుతార్ 3 వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన పాకిస్తాన్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. హంగర్గేకర్.. పాక్ ఓపెనర్ సయీమ్ ఆయుబ్ను డకౌట్ చేయడంతో పాటు వన్డౌన్ బ్యాటర్ ఒమైర్ యూసఫ్ను కూడా పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్కు పంపాడు.
దీంతో ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోయిన పాక్ను ఓపెనర్ షాహిజాదా ఫర్హాన్(35), హసీబుల్లా ఖాన్(27) ఆదుకునే ప్రయత్నం చేశారు. టాపార్డర్ విఫలమైన వేళ లోయర్ ఆర్డర్లో వచ్చిన కాసిం అక్రమ్(48), ముబాసిర్ ఖాన్(28) ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశారు. ఆఖర్లో మెహ్రాన్ మంతాజ్ 25 పరుగులతో అజేయంగా నిలిచాడు. అయితే భారత బౌలర్ల ధాటికి 48 ఓవర్లలోనే పాకిస్తాన్ కథ ముగిసింది. 205 పరుగులు చేసి దాయది జట్టు ఆలౌట్ అయింది.
Innings Break!
— BCCI (@BCCI) July 19, 2023
A fifer from Rajvardhan Hangargekar helps India 'A' restrict Pakistan 'A' to 205 👏🏻
Stay tuned for the chase!
Scorecard - https://t.co/6vxep2BpYw#ACCMensEmergingTeamsAsiaCup | #ACC pic.twitter.com/YQHAZquMIQ