టీమిండియాకు ఘోర పరాభవం.. వరుసగా రెండో మ్యాచ్లో ఓటమి
బంగ్లాదేశ్లో పర్యటిస్తున్న భారత మహిళల జట్టు వరుసగా రెండు మ్యాచ్లో ఓడింది.
దిశ, వెబ్డెస్క్: బంగ్లాదేశ్లో పర్యటిస్తున్న భారత మహిళల జట్టు వరుసగా రెండు మ్యాచ్లో ఓడింది. వన్డే సిరీస్ను ఓటమితో ప్రారంభించింది. ఇవాళ జరిగిన తొలి మ్యాచ్లో భారత్ 40 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. వర్షం కారణంగా 44 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్లో.. మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 43 ఓవర్లలో 152 పరుగులకు ఆలౌట్ కాగా.. భారత్ 35.5 ఓవర్లలో 113 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లు బంతితో రాణించినప్పటికీ.. బ్యాటింగ్లో దారుణంగా విఫలమయ్యారు.
భారత ఇన్నింగ్స్లో దీప్తి శర్మ చేసిన 20 పరుగులే అత్యధికం. స్మృతి మంధన (11) వైఫల్యాల పరంపర కొనసాగించగా.. హర్మన్ప్రీత్ కౌర్ (5), యస్తిక భాటియా (15), జెమీమా రోడ్రిగెస్ (10), చేతులెత్తేశారు. మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్.. కెప్టెన్ నిగార్ సుల్తానా (39) టాప్ స్కోరర్గా నిలిచింది. ఫర్జానా హక్ (27), ముర్షిదా ఖాతూన్ (13), రబియా ఖాన్ (10), ఫాతిమా ఖాతూన్ (12 నాటౌట్), సుల్తానా ఖాతూన్ (16) రెండంకెల స్కోర్లు చేశారు. భారత బౌలర్లలో.. అమన్జోత్ కౌర్ (4), దేవిక వైద్య (2), దీప్తి శర్మ (1) వికెట్లు తీశారు. బంగ్లా ఇన్నింగ్స్లో ఈ గెలుపుతో 3 మ్యాచ్ల సిరీస్లో బంగ్లాదేశ్ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో వన్డే జులై 19న ఢాకా వేదికగా జరుగనుంది.
A historic win for Bangladesh women 🎉
— ICC (@ICC) July 16, 2023
They beat India for the first time in ODIs 👏 #BANvIND | 📝: https://t.co/VyIVyAqSuF pic.twitter.com/AiZ6h3Era6