Asian Games-2023: మిక్స్డ్ రిలేలో భారత్కు కాంస్యం..
చైనాలో జరుగుతున్న 19వ ఆసియా క్రీడల్లో భారత్ ఖాతాలో మరో పతకం చేరింది.
దిశ, వెబ్డెస్క్: చైనాలో జరుగుతున్న 19వ ఆసియా క్రీడల్లో భారత్ ఖాతాలో మరో పతకం చేరింది. 4X400 మీటర్ల మిక్స్డ్ రిలేలో ఇండియన్ టీమ్ రెండో స్థానంలో నిలిచి రజత పతకం సాధించింది. అంతేగాక ఇవాళ స్టీపుల్ చేజ్లో భారత్కు మూడు పతకాలు వచ్చాయి. మెన్స్ 3000 మీటర్ల విభాగంలో అవినాష్ సాబిల్కు గోల్డ్, ఉమెన్స్ 3000 మీటర్ల విభాగంలో పారుల్, ప్రీతిలకు వరుసగా రజతం, కాంస్యం దక్కాయి. షూటింగ్, రోయింగ్, సెయిలింగ్ తదితర క్రీడాంశాల్లో భారత క్రీడాకారులు అద్భుతాలు చేశారు. దాంతో ఈ ఆసియా క్రీడల్లో భారత్ సాధించిన పతకాల సంఖ్య ఇప్పటి వరకు అర్ధ సెంచరీ దాటింది.
🥈it is for the the Indian 4X400 m Mixed Relay Team at #AsianGames2022
— SAI Media (@Media_SAI) October 2, 2023
The quartet of Muhammed Ajmal, Ramraj Vithya, Ramesh Rajesh & #KheloIndia Athlete Venkatesan Subha clocked a new National Record timing of 3:14.34 to grab the🥈
Many congratulations to the team! Well… pic.twitter.com/KVcC6b4kR0