Ashes 2023: కమిన్స్ సేన షాకింగ్ నిర్ణయం.. 11 ఏళ్లలో తొలిసారి!
యాషెస్ నాలుగో టెస్టుకు ఆసీస్ జట్టు ఓ షాకింగ్ నిర్ణయం తీసుకుంది.
దిశ, వెబ్డెస్క్: యాషెస్ నాలుగో టెస్టుకు ఆసీస్ జట్టు ఓ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. తుది జట్టులో ప్రధాన స్పిన్నర్ లేకుండా బరిలోకి దిగుతుంది. ఇలా స్పిన్నర్ లేకుండా ఆసీస్ జట్టు బరిలో దిగడం గత 11 ఏళ్లలో ఇదే తొలిసారి. రెండో టెస్ట్సమయంలో స్పిన్నర్ నాథన్ లైయన్తీవ్రంగా గాయపడ్డాడు. ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో గాయపడిన లైయన్.. ఆ తర్వాత బౌలింగ్ చేయడానికి మైదానంలోకి రాలేదు. కానీ జట్టుకు అవసరం అని తెలిసినప్పుడు చివర్లో బ్యాటింగ్కు దిగాడు. నొప్పి భరిస్తూనే జట్టుకు స్కోర్అందించే ప్రయత్నం చేశాడు. దీంతో నాలుగో టెస్ట్కోసం ఆసీస్ టీం మేనేజ్మెంట్ఈ బలమైన నిర్ణయానికి దిగింది.
అయితే జట్టులో ప్రధాన స్పిన్నర్ లేనప్పటికీ.. స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్ రూపంలో ఆ టీంలో ఇద్దరు పార్ట్ టైమ్ స్పిన్నర్లు ఉన్నారు. మరోవైపు ఈ మ్యాచ్ జరగనున్న ఓల్డ్ ట్రాఫోర్డ్ పిచ్ పూర్తిగా పేస్ బౌలింగ్కు సహకరించేలా ఉంది. దానికితోడు ఇక్కడ వర్షం పడే అవకాశం కూడా ఉంది. దీంతో ఈ వేదికపై స్పిన్నర్లు పెద్దగా ప్రభావం చూపకపోవచ్చని ఆసీస్ టీం భావిస్తోంది.
మూడో టెస్టులో అనూహ్యంగా ఓడినప్పటికీ ఆసీస్ జట్టు ప్రస్తుతం ఈ సిరీస్లో 2-1తో ఆధిక్యంలో ఉంది. ఈ క్రమంలోనే నాలుగో టెస్టులో ఆడే జట్టులో ఆస్ట్రేలియా ప్రధానంగా రెండు మార్పులు చేసింది. పేసర్ స్కాట్ బోలాండ్, స్పిన్నర్ టాడ్ మర్ఫీని రానున్న మ్యాచ్ కోసం పక్కన పెట్టింది. వీరి స్థానాల్లో స్టార్ పేసర్ జోష్ హేజిల్వుడ్, యంగ్ ఆల్రౌండర్ కామెరూన్ గ్రీన్ను తుది జట్టులోకి తీసుకుంది. మూడో టెస్టులో అద్భుతంగా రాణించిన మిచెల్ మార్ష్ కూడా జట్టులో కొనసాగనున్నాడు.
ఆస్ట్రేలియా తుది జట్టు:
ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), మార్నస్ లబుషేన్, జోష్ హేజిల్వుడ్, ఉస్మాన్ ఖవాజా, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, కామెరూన్ గ్రీన్, అలెక్స్ క్యారీ (వికెట్ కీపర్), మిచెల్ స్టార్క్, డేవిడ్ వార్నర్.