యశ్‌ ధుల్‌ సూపర్ సెంచరీ.. ఆసియా కప్‌లో టీమిండియా బోణీ‌

ఏసీసీ మెన్స్‌ ఎమర్జింగ్‌ టీమ్స్‌ ఆసియా కప్‌లో టీమిండియా బోణీ కొట్టింది.

Update: 2023-07-14 11:21 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఏసీసీ మెన్స్‌ ఎమర్జింగ్‌ టీమ్స్‌ ఆసియా కప్‌లో టీమిండియా బోణీ కొట్టింది. యూఏఈతో ఇవాళ జరిగిన మ్యాచ్‌లో భారత్‌-ఏ.. 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కెప్టెన్‌ యశ్‌ ధుల్‌ అజేయమైన సూపర్‌ సెంచరీతో (84 బంతుల్లో 108; 20 ఫోర్లు, సిక్స్‌) రాణించగా.. అతనికి నికిన్‌ జోస్‌ (41 నాటౌట్‌) సహకరించాడు. ఫలితంగా భారత్‌.. మరో 23.3 ఓవర్లు మిగిలుండగానే విజయఢంకా మోగించింది.

ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన యూఏఈ.. నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 175 పరుగులు మాత్రమే చేయగలిగింది. యూఏఈ ఇన్నింగ్స్‌లో అయాన్ష్‌ శర్మ (38), కెప్టెన్‌ చిదంబరం (46), అలీ నసీర్‌ (10), మొహమ్మద్‌ ఫరాజుద్దీన్‌ (35), జష్‌ గియనాని (13) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. భారత బౌలర్‌లో.. హర్షిత్‌ రాణా (4), నితిశ్‌ రెడ్డి (2), మానవ్‌ సుథార్‌ (2), ఆకాశ్‌ సింగ్‌ (1) వికెట్లు తీశారు.


Similar News