IND VS PAK Final: పాక్ బ్యాటర్ విధ్వంసకర సెంచరీ.. టీమిండియా ముందు భారీ టార్గెట్
దిశ, వెబ్డెస్క్: ఏసీసీ మెన్స్ ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ ఫైనల్లో భాగంగా కొలొంబో వేదికగా పాకిస్తాన్తో జరుగుతున్న మ్యాచ్లో పాక్కు భారత-ఏ జట్టు ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఈ మ్యాచ్లో పాక్ మొదట బ్యాటింగ్ చేయగా.. పాక్ ఓపెనర్లు సైమ్ అయూబ్ (51 బంతుల్లో 59), సాహిబ్జాదా ఫర్హాన్ (62 బంతుల్లో 65) మెరుపు ఆరంభాన్ని అందించగా.. నాలుగో స్థానంలో బరిలోకి దిగిన తయ్యబ్ తాహిర్ (71 బంతుల్లో 108; 12 ఫోర్లు, 4 సిక్సర్లు) విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు. ఫలితంగా పాక్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 352 పరుగుల భారీ స్కోర్ చేసింది. భారత బౌలర్లలో హంగార్గేకర్, రియాన్ పరాగ్ చెరో 2 వికెట్లు పడగొట్టగా.. హర్షిత్ రాణా, మానవ్ సుతార్, నిషాంత్ సింధు తలో వికెట్ తీశారు.
Innings Break!
— BCCI (@BCCI) July 23, 2023
Pakistan 'A' post 352/8 in the first innings.
🎯 India 'A' need 3⃣5⃣3⃣ to win the #ACCMensEmergingTeamsAsiaCup Final 🏆
Second innings coming up shortly.
Scorecard - https://t.co/qztT65tDLs #ACC pic.twitter.com/xUZJY3WaOR