18 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. పాకిస్తాన్‌ క్రికెటర్‌ సంచలన నిర్ణయం

పాకిస్తాన్‌ మహిళా స్టార్‌ క్రికెటర్‌ ఆయేషా నసీమ్ సంచలన నిర్ణయం తీసుకుంది.

Update: 2023-07-20 12:15 GMT

దిశ, వెబ్‌డెస్క్: పాకిస్తాన్‌ మహిళా స్టార్‌ క్రికెటర్‌ ఆయేషా నసీమ్ సంచలన నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ క్రికెట్‌కు ఆయేషా నసీమ్ రిటైర్మెంట్‌ ప్రకటించింది. 18 ఏళ్లకే ఆమె క్రికెట్‌కు గుడ్‌బై చెప్పడం గమనార్హం. ఇస్లాం మతానికి అనుగుణంగా మరింత పవిత్రమైన జీవితాన్ని గడపడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె తెలిపింది. ఆమె తన నిర్ణయాన్ని పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డుకు కూడా తెలియజేసింది. ఆయేషా నసీమ్ 2020లో పాకిస్తాన్‌ తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టగా.. తన కెరీర్‌లో 33 టీ20లు, 3 వన్డేలు ఆడిన నసీమ్‌.. వరుసగా 369, 33 పరుగులు సాధించింది. ఆయేషా నసీమ్ చివరగా పాకిస్తాన్‌ తరఫున ఈ ఏడాది ఫిబ్రవరిలో ఐర్లాండ్‌పై ఆడింది.


Similar News