రచ్చకెక్కిన MLC ఇంటిపోరు.. రెండో పెళ్లి వార్తలపై స్పందించిన దివ్వెల మాధురి

వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటిపోరు రచ్చకెక్కింది. రెండో పెళ్లి చేసుకొని తనను రోడ్డున పడేశారని ఆయన భార్య దువ్వాడ వాణి సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.

Update: 2024-08-09 12:53 GMT

దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటిపోరు రచ్చకెక్కింది. రెండో పెళ్లి చేసుకొని తనను రోడ్డున పడేశారని ఆయన భార్య దువ్వాడ వాణి సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఇదే విషయమై ఆమె కూతుళ్లతో రోడ్డెక్కి నిరసన తెలిపారు. దివ్వెల మాధురి అనే మహిళతో వేరు కాపురం పెట్టాడని ఇటీవల కన్నీరు పెట్టారు. ఏ హక్కుతో మాధురి మా ఇంట్లో, నా భర్తతో ఉంటోందని ప్రశ్నించారు. తాజాగా ఈ వ్యాఖ్యలపై దివ్వెల మాధురి స్పందించారు. శుక్రవారం మాధురి మీడియాతో మాట్లాడారు. తనకు రాజకీయాలు తెలియవని అన్నారు. టికెట్ కోసమే వాణి నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నదని మండిపడ్డారు. దువ్వాడ శ్రీనివాస్ తనకు మంచి ఫ్రెండ్, గైడ్, కేర్ టేకర్, ఫిలాసఫర్ అని చెప్పారు. వాణి తన రాజకీయ భవిష్యత్తు కోసం తనను ఓ పావులా వాడుకుంటోందని సీరియస్ అయ్యారు. వాణి నన్ను పాలిటిక్స్‌లోకి ట్రాప్ చేసింది.. నేను శ్రీనివాస్‌ను ట్రాప్ చేయలేదని మాధురి స్పష్టం చేశారు. కాగా, శ్రీకాకుళం జిల్లా టెక్కలిలోని అక్కవరం సమీపంలో జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న ఆయన ఇంట్లో వాణితో వేరు కాపురం పెట్టాడని భార్యా, పిల్లలు ఆరోపణలు చేస్తున్నారు.



 


Tags:    

Similar News