Nara Lokesh: భారత క్రికెటర్‌ను కలవడం ఆనందంగా ఉంది.. మంత్రి నారా లోకేష్

నేడు ప్రముఖ బారత క్రికెటర్ హనుమవిహారి మంత్రి నారా లోకేష్‌తో భేటీ అయ్యారు.

Update: 2024-06-25 10:54 GMT

దిశ వెబ్ డెస్క్: నేడు ప్రముఖ బారత క్రికెటర్ హనుమవిహారి మంత్రి నారా లోకేష్‌తో భేటీ అయ్యారు. ఈ విషయాన్ని నారా లోకేష్ స్వయంగా తన టిట్టర్ వేదిక ద్వారా తెలిపారు. ‘నేడు బారత క్రికెటర్ హనుమవిహారిని కలవడం ఆనందంగా ఉంది. అంతకుముందు ప్రభుత్వం అతనిని రాజకీయ బెదిరింపులకు, , అవమానాలకు గురిచేసి చివరికి ఆంధ్రా క్రికెట్ నుండి ఎలా తరిమికొట్టిందంటే వైసీపీకి అంతకుమించిన సిగ్గుచేటు చర్య మరొకటి లేదని మండిపడ్డారు.

ఆయనను ఆంధ్రప్రదేశ్‌కు తిరిగి ఆహ్వానించి మరోసారి తెలుగువారు గర్వించేలా కృషి చేయాలని కోరారు. అలానే ఆయనకు తమ పూర్తి మద్దతు ఉంటుందని ట్వీట్ చేశారు. కాగా వైసీపీ హయాంలో బెంగాల్‌‌కు ఆంధ్రాకు మ్యాచ్ జరుగుతున్న సమయంలో 17వ ఆటగాడు ఎదో పోరపాటు చేయడంతో, ఆ సమయంలో టీమ్ కెప్టెన్‌గా ఉన్న హనుమవిహారి అతనిపై కోపడ్డారు. కాగా 17వ ఆటగాడు తన తండ్రికి ఫిర్యాదు చుశారు. కాగా 17వ ఆటగాడు తన తండ్రికి వైసీపీ నేతలతో మంచి పరిచయాలు ఉండడంతో, ఆ పరిచయాలను అడ్డుపెట్టుకుని హనుమవిహారిని జట్టు నుండి తొలిగించిన విషయం అందరికీ తెలిసిందే.


Similar News