రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు పట్టాభిరామ్

దిశ, ఏపీ బ్యూరో: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిరామ్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. పట్టాభికి విజయవాడ మూడో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు 14 రోజులపాటు రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. దీంతో పట్టాభిరామ్ మచిలీపట్నం సబ్‌జైలులో ఉన్నారు. అయితే తాజాగా పట్టాభిరామ్‌ని మచిలీపట్నం సబ్ జైలు నుంచి రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలుకు తరలించారు. నవంబర్‌ 2 వరకు పట్టాభి రాజమహేంద్రవరం […]

Update: 2021-10-22 03:13 GMT

దిశ, ఏపీ బ్యూరో: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిరామ్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. పట్టాభికి విజయవాడ మూడో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు 14 రోజులపాటు రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. దీంతో పట్టాభిరామ్ మచిలీపట్నం సబ్‌జైలులో ఉన్నారు. అయితే తాజాగా పట్టాభిరామ్‌ని మచిలీపట్నం సబ్ జైలు నుంచి రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలుకు తరలించారు. నవంబర్‌ 2 వరకు పట్టాభి రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలులోనే ఉండనున్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News