Mamata Banerjee :మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్‌కు సీఎం మమత లేఖ వైరల్

దిశ, నేషనల్ బ్యూరో : కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో జూనియర్ వైద్యురాలిపై జరిగిన హత్యాచారం ఘటనపై సీబీఐ దర్యాప్తు వేగాన్ని పుంజుకుంది.

Update: 2024-08-23 14:35 GMT

దిశ, నేషనల్ బ్యూరో : కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో జూనియర్ వైద్యురాలిపై జరిగిన హత్యాచారం ఘటనపై సీబీఐ దర్యాప్తు వేగాన్ని పుంజుకుంది. ఈ కేసులో మొట్టమొదట అరెస్టయిన నిందితుడు సంజయ్ రాయ్‌తో పాటు కాలేజీ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్‌‌ కీలకంగా మారారు. త్వరలోనే వీరిద్దరికీ లై డిటెక్టర్ పరీక్షను కూడా సీబీఐ నిర్వహించబోతోంది. ఈ తరుణంలో 2022 సంవత్సరం జూన్ 30న సందీప్‌ ఘోష్ బర్త్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ సీఎం మమతా బెనర్జీ రాసిన ఓ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

దీంతో సీఎం మమతా బెనర్జీతో సందీప్ ఘోష్‌కు సన్నిహిత సంబంధాలున్నాయనే ప్రచారం జరుగుతోంది. ఈ సంబంధాల వల్లే ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో ప్రిన్సిపల్ పదవికి రాజీనామా చేసిన వెంటనే ఆయనకు కోల్‌కతా నేషనల్ మెడికల్ కాలేజీలో ప్రిన్సిపల్‌గా పోస్టింగ్ లభించిందని అంటున్నారు. ఓ వైపు ఆర్జీ కర్ మెడికల్ కాలేజీకి చెందిన జూనియర్ వైద్యురాలిపై జరిగిన దురాగతంపై దర్యాప్తు జరుగుతుంటే.. ఇంకోవైపు సందీప్ ఘోష్‌కు హుటాహుటిన పోస్టింగ్‌ను ఎందుకు కేటాయించారనే ప్రశ్నను చాలామంది లేవనెత్తతున్నారు.


Similar News