ఉత్తరాఖండ్ లో కొండచరియలు కూలి ఇద్దరు హైదరాబాద్ టూరిస్టులు మృతి!

కొండ చరియలు విరిగిపడటంలో ఇద్దరు హైదరాబాద్ వాసులు మృతి చెందిన ఘటన ఉత్తరాఖండ్ లో చోటుచేసుకుంది.

Update: 2024-07-06 10:42 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: కొండ చరియలు విరిగిపడటంలో ఇద్దరు హైదరాబాద్ వాసులు మృతి చెందిన ఘటన ఉత్తరాఖండ్ లో చోటుచేసుకుంది. కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా భద్రీనాథ్ జాతీయ రహదారి పై కొండచరియలు విరిగిపడి ఆరు చోట్ల రోడ్లు మూసుకుపోయాయి. దీంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులుగా మారింది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ కు చెందిన నిర్మల్ షాహి(36), సత్య నారాయణ (50) అనే టూరిస్ట్ లు హిమాలయన్ టెంపుట్ దర్శనానికి వెళ్లి వస్తున్నారు. బద్రీనాథ్ జాతీయ రహాదారిపై గౌచర్, కర్ణప్రయాగ్ ల మధ్య చత్వాపీపాల్ సమీపంలో వీరికి ప్రమాదం జరిగింది. రోడ్డుపై వెళుతున్న వీరికి కొండచరియలు విరిగిపడి బండరాళ్లు ఢీ కొనడంతో అక్కడికక్కడే మృతి చెందారని స్థానిక పోలీసు అధికారి తెలిపారు. శిథిలాల నుంచి వారి మృతదేహాలను బయటకు తీశామని, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా, బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ సిబ్బంది రోడ్లను క్లియర్ చేసే పనిలో నిమగ్నమై ఉన్నారని పోలీసులు తెలిపారు.   


Similar News