వణికిస్తున్న ఎక్స్ఈసీ కోవిడ్ వేరియంట్.. 27 దేశాల్లో విజృంభణ
కొత్తరకం కోవిడ్ వైరస్ ఎక్స్ఈసీ వేగంగా విస్తరిస్తూ ప్రపంచ దేశాలను వణికిస్తుంది. అత్యంత ప్రమాదకరమైన ఎక్స్ఈసీ కోవిడ్ వేరియంట్ పట్ల అప్రమత్తంగా ఉండాలని..ముందస్తు నివారణ చర్యలు తీసుకోవాలని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
దిశ, వెబ్ డెస్క్ : కొత్తరకం కోవిడ్ వైరస్ ఎక్స్ఈసీ వేగంగా విస్తరిస్తూ ప్రపంచ దేశాలను వణికిస్తుంది. అత్యంత ప్రమాదకరమైన ఎక్స్ఈసీ కోవిడ్ వేరియంట్ పట్ల అప్రమత్తంగా ఉండాలని..ముందస్తు నివారణ చర్యలు తీసుకోవాలని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. తొలుత జర్మనీలో కనుగొన్న ఎక్స్ఈసీ కోవిడ్ వేరియంట్ బ్రిటన్, అమెరికా, డెన్మార్క్తో పాటు ఇతర యూరోప్ దేశాల్లో వేగంగా విస్తరిస్తుంది. ఇప్పటికే 27 దేశాల్లో విస్తరించిన ఎక్స్ఈసీ కోవిడ్ వేరియంట్ కేసుల నుంచి 500 శ్యాంపిళ్ళను సేకరించి పరీక్షిస్తున్నారు. ఓమిక్రాన్ వేరియంట్కు సబ్లీనియేజ్గా ఉన్న ఈ కొత్త వేరియంట్లో కొత్త తరహా మ్యుటేషన్లు జరుగుతున్నాయని, గతంలో ప్రబలిన ఓమిక్రాన్ సబ్వేరియంట్లు కేఎస్.1.1, కేపీ.3.3 తరహాలో ఎక్స్ఈసీ వ్యాపిస్తుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. పోలాండ్, నార్వే, లగ్జంబర్గ్, ఉక్రెయిన్, పోర్చుగల్, చైనా దేశాల్లో ఎక్స్ఈసీ కోవిడ్ వేరియంట్ కేసులు నమోదు అయ్యాయి.
ఇటీవల వచ్చిన కోవిడ్ వేరియంట్ల కంటే ఎక్స్ఈసీ కోవిడ్ వేరియంట్ వేగంగా విస్తరిస్తున్నట్లుగా లండన్ జెనటిక్స్ కాలేజీ ప్రొఫెసర్ ఫ్రాంకోసిస్ బల్లాక్స్ తెలిపారు. ఎక్స్ఈసీ కోవిడ్ వేరియంట్ సోకిన వారిలో జ్వరం, గొంతు నొప్పి, దగ్గు, వాసన కోల్పోవడం, బరువు తగ్గడం, ఒళ్లు నొప్పులు లాంటి లక్షణాలు ఉంటాయని పేర్కొన్నారు. ఓమిక్రాన్ వేరియంట్కు చెందినది కావడంతో వ్యాక్సిన్లు, బూస్టర్లతో రక్షణ కల్పించవచ్చని, స్వచ్చమైన గాలిని పీల్చాలని అమెరికా సీడీసీ తెలిపింది.