ఒక్కరోజులో రూ.521 కోట్లు సంపాదించిన TDP అగ్రనేత.. పార్లమెంట్‌లో లేవనెత్తిన టీఎంపీ ఎంపీ

పశ్శిమబెంగాల్‌కు చెందిన టీఎంసీ ఎంపీ క‌ల్యాణ్ బెన‌ర్జీ పార్లమెంట్‌లో టీడీపీ అగ్రనేత సంపాదనపై కీలక వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-07-02 14:34 GMT

దిశ, వెబ్‌డెస్క్: పశ్శిమబెంగాల్‌కు చెందిన టీఎంసీ ఎంపీ క‌ల్యాణ్ బెన‌ర్జీ పార్లమెంట్‌లో టీడీపీ అగ్రనేత సంపాదనపై కీలక వ్యాఖ్యలు చేశారు. స్టాక్ మార్కెట్‌లో టీడీపీ అగ్రనేత ఒకే ఒక్క రోజులో రూ.521 కోట్లు సంపాదించారు, ఈ వ్యవ‌హారంపై ద‌ర్యాప్తు చేయాలని ఆయన సభలో డిమాండ్ చేశారు. అలాగే రాత్రికి రాత్రే అంత సంపాదన వస్తే.. ఆయ‌న‌పై ఈడీ, సీబీఐ ఉన్నా ఎందుకు అరెస్ట్ చేయ‌లేదు. ఆయ‌న‌ ఇప్పుడు అవినీతిప‌రుడు కాదా అంటూ టీఎంసీ ఎంపీ క‌ల్యాణ్ బెన‌ర్జీ సభలో ప్రశ్నించారు. కాగా 2024 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ విజయం అనంతరం స్టాక్ మార్కెట్లో హెరిటేజ్ విలువలు భారీగా పెరిగాయి. దీంతో ఒక్క రోజులో నారా లోకేష్ ఆస్తుల విలువ రూ.521 కోట్లు పెరిగింది. అలాగే కేంద్ర ప్రభుత్వంలో టీడీపీ అత్యంత కీలకం కావడంతో స్టాక్ మార్కెట్‌లో నారా కుటుంభానికి చెందిన అన్ని కంపెనీల స్టాక్స్ విలువలు భారీగా పెరిగాయి.

Similar News