నిలకడగా అద్వానీ ఆరోగ్యం.. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్

బీజేపీ సీనియర్ నేత, రాజకీయ కురువృద్ధుడు ఎల్‌కే అద్వానీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. బుధవారం సాయంత్రం అస్వస్థతకు గురైన అద్వానీ ఢిల్లీలోని అపోలో ఆస్పత్రిలో చేరారు.

Update: 2024-07-04 15:54 GMT

దిశ, నేషనల్ బ్యూరో: బీజేపీ సీనియర్ నేత, రాజకీయ కురువృద్ధుడు ఎల్‌కే అద్వానీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. బుధవారం సాయంత్రం అస్వస్థతకు గురైన అద్వానీని.. ఆయన కుటుంబసభ్యులు ఢిల్లీలోని అపోలో ఆస్పత్రిలో చేర్చారు. కాగా.. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉండటంతో వైద్యులు డిశ్చార్జ్ చేశారు. న్యూరాలజీ విభాగంలోని వైద్యుల బృందం పర్యవేక్షణలో అద్వానీ ఉన్నట్లు అపోలో హాస్పిటల్స్ ఒక ప్రకటన విడుదల చేసింది. డాక్టర్ వినిత్ సూరి పర్యవేక్షణలో ట్రీట్మెంట్ తీసుకున్నట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఇకపోతే, 96 ఏళ్ల అద్వానీ వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నారు. ఇటీవలే, అనారోగ్యంతో ఎయిమ్స్ ఆస్పత్రిలో చేరారు. ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత వైద్యులు డిశ్చార్జ్ చేశారు. ఇక బుధవారం మరోసారి అస్వస్థతకు గురవ్వడంతో ఆస్పత్రిలో చేరారు. ఆరోగ్యం కుదటపడడంతో గురువారం సాయంత్రం డిశ్చార్జ్ చేసినట్లు అపోలో ఆస్పత్రి పేర్కొంది.


Similar News