పుట్టిన వారు ఏదో ఒక రోజు చావాల్సిందే: హత్రాస్ ఘటనపై భోలేబాబా వ్యాఖ్యలు

ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్ లో ఇటీవల భోలే బాబా సత్సంగ్ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 121 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.

Update: 2024-07-17 17:03 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్ లో ఇటీవల భోలే బాబా సత్సంగ్ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 121 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై భోలే బాబా తొలిసారిగా స్పందించారు. తన జన్మస్థలమైన బహదూర్ నగర్ లోని కాస్ గంజ్ లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘జూలై 2 జరిగిన ఘటన తర్వాత నేను చాలా బాధపడ్డా. కానీ జరగబోయే దానిని ఎవరు ఆపగలరు. భూమి మీదకు వచ్చిన వారు ఏదో ఒకరోజు వెళ్లిపోవాల్సిందే’ అని వ్యాఖ్యానించారు. ఈ విషాద ఘటనలో కొంత కుట్ర కూడా దాడి ఉందని తెలిపారు. సిట్ విచారణపై నమ్మకం ఉందని, ఏదో ఒక రోజు వాస్తవం బయటపడుతుందని తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తులు విషపూరిత పదార్థం మీద చల్లారని కొంత మంది సాక్షులు ఈ విషయం చెప్పారన్నారు. ఇదే తొక్కిసలాటకు దారి తీసిందని చెప్పారు. 

Similar News