బంగ్లాతో టెస్టులో కష్టాల్లో టీమిండియా

బంగ్లాదేశ్ తొలి టెస్టులో టీమిండియా బ్యాటర్ల వైఫల్యంతో రెండో సెషన్ ముగిసే సమయానికి 48ఓవర్లకు 6గురు టాప్, మిడిల్ ఆర్డర్ బ్యాటర్ల వికెట్లు కోల్పోయి 176పరుగులతో ఆట కొనసాగిస్తుంది.

Update: 2024-09-19 08:54 GMT

దిశ, వెబ్ డెస్క్ : బంగ్లాదేశ్ తో తొలి టెస్టులో  మొదట బ్యాటింగ్ చేస్తున్న  టీమిండియా బ్యాటర్ల వైఫల్యంతో రెండో సెషన్ ముగిసే సమయానికి 48ఓవర్లకు 6గురు టాప్, మిడిల్ ఆర్డర్ బ్యాటర్ల వికెట్లు కోల్పోయి 176పరుగులతో ఆట కొనసాగిస్తుంది. యువ పేసర్ హసన్ మహ్మద్ దెబ్బకు తొలి నలుగురు ఆటగాళ్లు ఓపెనర్లు రోహిత్ శర్మ(6), శుభమన్ గిల్(0), విరాట్ కోహ్లీ(6), రిషబ్ పంత్(39) లు ఒకరివెంట ఒకరు పెవిలియన్ చేరారు. యువ ఓపెనర్ యశస్వీ జైస్వాల్ వికెట్ల పతనాన్ని అడ్దుకున్నప్పటికి చివరకు( 56) పరుగులకు, కేఎల్ రాహుల్ (16)పరుగులకు ఔటయ్యారు. జడేజా 7, అశ్విన్ 21పరుగులతో ఆడుతున్నారు. నహిద్ రాణా, మెహిద్ హసన్ మిరాజ్ లు చెరో వికెట్ తీశారు. 


Similar News