మరిన్ని నెలలు ఐఎస్ఎస్లోనే సునీతా విలియమ్స్
దిశ, నేషనల్ బ్యూరో : అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాని(ఐఎస్ఎస్)కి జూన్ 5న వెళ్లిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ ఇంకా అక్కడే ఉన్నారు.
దిశ, నేషనల్ బ్యూరో : అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాని(ఐఎస్ఎస్)కి జూన్ 5న వెళ్లిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ ఇంకా అక్కడే ఉన్నారు. ఆమె మరో రెండు నుంచి మూడు నెలల పాటు అక్కడే ఉండాల్సి రావచ్చని నాసా ప్రకటించింది. 10 రోజుల స్పేస్ మిషన్ కోసం వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్ మోర్ కలిసి బోయింగ్ కంపెనీకి చెందిన స్టార్ లైన్ స్పేస్ క్రాఫ్టులో ఐఎస్ఎస్కు వెళ్లారు. అయితే వారు అక్కడికి చేరుకున్నాక.. స్పేస్ క్రాఫ్టులో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. వాటిని సరిదిద్ది, టెస్టింగ్లు విజయవంతంగా పూర్తి చేసిన తర్వాతే.. సునీతా విలియమ్స్, బుచ్ విల్ మోర్ అందులో ప్రయాణించి భూమికి చేరుకునే అవకాశం ఉందని బోయింగ్ కంపెనీ వెల్లడించింది. వాళ్లిద్దరూ సేఫ్గానే ఐఎస్ఎస్లో ఉన్నారని స్పష్టం చేసింది.