లగ్జరీ ఎస్టేట్లో సిద్ధార్థ్ మాల్యా వివాహం
వారి వివాహం లండన్కు దగ్గరలో ఉన్న లగ్జరీ ఎస్టేట్లో ఘనంగా జరిగింది.
దిశ, నేషనల్ బ్యూరో: వ్యాపారవేత్త, పరారీలో ఉన్న విజయ్ మాల్యా కుమారుడు సిద్ధార్థ్ మాల్యా తన స్నేహితురాలు జాస్మిన్ను వివాహం చేసుకున్నాడు. వారి వివాహం లండన్కు దగ్గరలో ఉన్న లగ్జరీ ఎస్టేట్లో ఘనంగా జరిగింది. సన్నిహితులు మాత్రమే హాజరైన ఈ వివాహానికి సంబంధించి సిద్ధార్థ్ మాల్యా స్నేహితుడు తన ఇన్స్టాగ్రామ్ పోస్టులో ఫోటోలను విడుదల చేశారు. వివాహం గురించి ఇదివరకు సిద్ధార్థ్ మాల్య సైతం ఇన్స్టాగ్రామ్లో తెలిపారు. లండన్కు సమీపంలో ఉన్న హెర్ట్ఫోర్డ్షైర్లోని లేడీవాక్ ఎస్టేట్లో వారి పెళ్లి వేడుక జరిగింది. ఈ ఎస్టేట్ను 2015లో విజయ్ మాల్యా కొనుగోలు చేశారు. ఆ సమయంలో విజయ్ మాల్యా సుమారు రూ. 117 కోట్ల వరకు వెచ్చించి కొన్నారు. అంతకుముందు ఎస్టేట్ ఎఫ్1 రేసింగ్ ఛాంపియన్ లూయిస్ హామిల్టన్ తండ్రి పేరున ఉండేది. 30 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ఎస్టేట్ మూడు ప్రధాన భవనాలను కలిగి ఉంది. స్విమ్మింగ్ పూల్స్, టెన్నిస్ కోర్టులు ఉన్నాయి.