Rajasthan: 18 జిల్లాల్లో ఎన్నికల క్యాంపెయిన్.. సీఎం 9 రోజుల యాత్ర ప్రారంభం

అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి రాజస్థాన్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ గెహ్లాట్ శ్రీకారం చుట్టారు.

Update: 2023-09-28 15:12 GMT

జైపూర్ : అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి రాజస్థాన్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ గెహ్లాట్ శ్రీకారం చుట్టారు. ‘సభా సంవాద్ ఔర్ దేవ్ దర్శన్’ పేరుతో ప్రజా చైతన్య యాత్రను ఆయన గురువారం జైపూర్‌లో ప్రారంభించారు. 9 రోజుల పాటు జరిగే ఈ యాత్రా కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని 18 జిల్లాల పరిధిలో ఉన్న 38 అసెంబ్లీ నియోజకవర్గాలలో పర్యటిస్తారు.

అక్కడ నిర్వహించే ఎన్నికల ప్రచార సభల్లో సీఎం ప్రసంగిస్తారు. రాబోయే ఏడేళ్లలో రాజస్థాన్ డెవలప్మెంట్‌కు సంబంధించి తన వద్దనున్న ‘‘మిషన్ 2030’’ విజన్ గురించి ఈ యాత్ర సందర్భంగా ప్రజలకు గెహ్లాట్ వివరించనున్నారు. ఈ ప్రచారంలో భాగంగా సీఎం గెహ్లాట్ 10 ప్రధాన ఆలయాలను కూడా సందర్శించనున్నారు.

Similar News