మళ్లీ అక్కడి నుండే రాహుల్ పోటీ.. డిపాజిట్ కూడా రాదంటున్న బీజేపీ

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వచ్చే లోక్ సభ ఎన్నికల్లో మరోసారి అమేథీ నుంచే పోటీ చేయనున్నారు.

Update: 2023-08-18 13:39 GMT

న్యూఢిల్లీ : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వచ్చే లోక్ సభ ఎన్నికల్లో మరోసారి అమేథీ నుంచే పోటీ చేయనున్నారు. ఉత్తరప్రదేశ్‌ కాంగ్రెస్‌ చీఫ్‌గా కొత్తగా నియమితులైన అజయ్ రాయ్‌ ఈవిషయాన్ని వెల్లడించారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వారణాసి నుంచి పోటీ చేసే ఛాన్స్ ఉందని తెలిపారు. రాహుల్, ప్రియాంక విజయం కోసం త్యాగనిరతితో పనిచేసేందుకు కాంగ్రెస్ క్యాడర్ రెడీగా ఉందని తెలిపారు.

దీనిపై బీజేపీ అధికార ప్రతినిధి స్పందిస్తూ.. రాహుల్ అమేథీ నుంచి పోటీ చేస్తే ఈసారి డిపాజిట్ కూడా దక్కదని వ్యాఖ్యానించారు. అమేథీతో పాటు వయనాడ్ నుంచి కూడా రాహుల్ పోటీ చేయరని తాము భావిస్తున్నట్లు చెప్పారు. కాగా, 2019 ఎన్నికల్లో రాహుల్ గాంధీ అమేథీ (యూపీ), వయనాడ్(కేరళ) లోక్ సభ స్థానాల నుంచి పోటీ చేశారు. కేరళలో విజయం సాధించిన ఆయన.. అమేథీలో స్మృతీ ఇరానీ చేతిలో 55వేల ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు.


Similar News