Rajinikanth: ప్రధాని మోదీ ఆరా.. రజినీకాంత్ హెల్త్ పై లేటెస్ట్ అప్డేట్

చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్న సూపర్ స్టార్ రజనీకాంత్ ఆరోగ్యంపై ప్రధాని నరేంద్రమోదీ ఆరా తీశారు. ఆయన భార్య లతకు ఫోన్ చేసి మాట్లాడినట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు అన్నామలై ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.

Update: 2024-10-02 05:37 GMT

దిశ, వెబ్ డెస్క్: తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ సోమవారం రాత్రి చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. దీంతో ఆయన ఆరోగ్య పరిస్థితిపై పలువురు ఆరా తీస్తున్నారు. ప్రధాని నరేంద్రమోదీ సైతం రజినీకాంత్ భార్య లతా తో ఫోన్ లో మాట్లాడి.. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు అన్నామలై వెల్లడించారు. ఈ మేరకు X వేదికగా ఆయన పోస్ట్ చేశారు. రజినీకాంత్ త్వరగా కోలుకోవాలని ప్రధాని ఆకాంక్షించారని తెలిపారు.

కాగా.. ఏపీ సీఎం చంద్రబాబు, తమిళనాడు సీఎం స్టాలిన్ కూడా రజినీకాంత్ ఆరోగ్య పరిస్థితి గురించి కుటుంబ సభ్యుల్ని అడిగి తెలుసుకున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆశిస్తూ.. హీరోలు కమల్ హాసన్, విజయ్ సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. రజినీకాంత్ గుండె నుంచి బయటకు వచ్చే ప్రధాన రక్తనాళంలో వాపు రాగా.. మంగళవారం (అక్టోబర్1) సాయంత్రం చెన్నై గ్రీమ్స్ రోడ్డులో ఉన్న అపోలో ఆస్పత్రిలో.. ట్రాన్స్ కాథెటర్ ట్రీట్మెంట్ చేసి స్టంట్ వేసినట్లు వైద్యులు తెలిపారు. మరో రెండ్రోజుల్లో ఆయన డిశ్చార్జ్ అవుతారని, ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వెల్లడించారు. 


Similar News