దిశ, వెబ్ డెస్క్ : ఢిల్లీలో నేడు కేంద్ర కేబినెట్ సమావేశం కానుంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగే కేంద్ర కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. హర్యానా, జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల వెల్లడవ్వడం.. మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికలు సమీపిస్తున్న క్రమంలో జరుగుతున్న కేంద్ర కేబినెట్ భేటీలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారన్నదానిపై ఆసక్తి నెలకొంది. జమిలీ ఎన్నికలపైన చర్చించవచ్చని, దసరా, దీపావళి పండగలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులకు పలు ప్రయోజనాలు ప్రకటించే అవకాశం కూడా ఉన్నట్టు సమాచారం.
హర్యానాలో తిరిగి అధికారం నిలబెట్టుకోవడం, జమ్మూ కశ్మీర్ లోనూ ఓట్ల శాతం పెంచుకోవడంతో పాటు అతిపెద్ద పార్టీగా బీజెపీ అవతరించిన నేపథ్యంలో కేబినెట్ భేటీలో రైతులు సహా యువతకు సంబంధించి కీలక నిర్ణయాలకు అవకాశముందని తెలుస్తొంది.