Air India flight: గోవాలో పక్షి ఢీకొనడంతో విమానం నిలిపివేత

గోవాలోని డబోలిమ్ ఎయిర్ పోర్టులో టేకాఫ్ సిద్ధమైన ఎయిరిండియా విమానం నిలిచిపోయింది.

Update: 2024-08-14 06:33 GMT

దిశ, నేషనల్ బ్యూరో: గోవాలోని డబోలిమ్ ఎయిర్ పోర్టులో టేకాఫ్ సిద్ధమైన ఎయిరిండియా విమానం నిలిచిపోయింది. విమానాన్ని పక్షి ఢీకొనడంతో విమానం గాల్లోకి ఎగరలేదు. బుధవారం తెల్లవారుజామున 6.45 గంటలకు ఈ ఘటన జరిగిందని ఎయిర్ పోర్టు అధికారులు తెలిపారు. గోవాలోని డబోలిమ్ విమానాశ్రయం నుంచి ముంబైకి వెళ్లాల్సి ఉంది. రన్‌వేపైనే విమానాన్ని పక్షి ఢీకొట్టడంతో టేకాఫ్‌ ఆపినట్లు విమానాశ్రయ అధికారులు తెలిపారు. తదుపరి విచారణ కోసం విమానాన్ని ఎయిర్ పోర్టులోనే ఉంచినట్లు తెలిపారు. విమానానికి ఏవైనా రిపేర్లు అవసరమా అన్న విషయాన్ని పరిశీలిస్తున్నట్లు చెప్పారు.


Similar News