అయోధ్యలో శ్రీరాముడి ప్రాణ ప్రతిష్టకు ముహూర్తం ఖరారు
యావత్ దేశం ఎదురుచూస్తున్న అయోధ్యలో శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ట ముహూర్తం ఫిక్స్ అయింది.
దిశ, వెబ్డెస్క్: యావత్ దేశం ఎదురుచూస్తున్న అయోధ్యలో శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ట ముహూర్తం ఫిక్స్ అయింది. 2024 జనవరి నెల మధ్యాహ్నం 12.20 గంటలకు మృగశిర నక్షత్రంలో అభిజిత్ ముహూర్తంలో అయోధ్యలో శ్రీరాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట చేస్తారు. ఈ కార్యక్రమం భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా జరగనుంది. కాగా ఈ ప్రాణప్రతిష్ట వేడకలను మొత్తం నాలుగు దశలుగా విభజించారు. ఇందులో భాగంగా తొలి దశ కార్యాచరణ అయోధ్య ట్రస్ట్ వారు సిద్ధం చేశారు. అలాగే రెండో దశలో మొత్తం 10 కోట్ల కుటుంబాలకు అక్షింతలు, రాంలాల చిత్రం, కరపత్రం ఇవ్వనున్నారు. మూడో దశలో జనవరి 22న అట్టహసంగా వేడుకలు నిర్వహిస్తారు. నాలుగో దశలో భాగంగా జనవరి 26 నుంచి రామ భక్తులకు శ్రీరాముడిని దర్శనం చేసుకోవడానికి అనుమతిస్తారు.