జమ్ముకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌.. ముగ్గురు ఉగ్రవాదుల హతం

సోమవారం ఉదయం.. జమ్ముకశ్మీర్‌లో(Jammu and Kashmir)ని అక్నూర్ సెక్టార్‌(Aknoor Sector)లో ఆర్మీవాహనంపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు.

Update: 2024-10-28 10:45 GMT

దిశ, వెబ్ డెస్క్: సోమవారం ఉదయం.. జమ్ముకశ్మీర్‌లో(Jammu and Kashmir)ని అక్నూర్ సెక్టార్‌(Aknoor Sector)లో ఆర్మీవాహనంపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. గంటల ప్రాంతంలో ముగ్గురు ఉగ్రవాదులు ఏకదాటిగా ఆర్మీ ఆంబులెన్స్‌(Army Ambulance)పై కాల్పులకు తెగబడ్డారు. కాగా.. కాల్పుల్లో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అయితే ఈ దాడి అందుకున్న ఆర్మీ అధికారులు ఉగ్రవాదులను పట్టుకునేందుకు హుటాహుటిన ఘటనా స్థలాన్ని చుట్టుముట్టారు. బటాల్ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ (Search operation) కొనసాగిస్తుండగా ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడ్డారు. దీంతో భద్రతాబలగాలు ఎదురుకాల్పులు(counter fire) జరిపారు. దీంతో అఖ్నూరులో ముగ్గురు ఉగ్రవాదులు(Three terrorists) మృతి చెందినట్లు అధికారులు వెళ్లడించారు. ఇదిలా ఉంటే జమ్మూ, కాశ్మీర్ ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం నుంచి ఉగ్రవాదులు నిత్యం దాడులు చేపడుతూనే ఉన్నారు.


Similar News