Manipoor Governor : గవర్నర్ నివాస సమీపంలో గ్రనేడ్ కలకలం

గత ఏడాదిన్నర కాలంగా మణిపూర్(Manipoor) లో ఏదోకరకమైన అల్లర్లు చెలరేగుతూనే ఉన్నాయి.

Update: 2024-10-28 10:56 GMT

దిశ, వెబ్ డెస్క్ : గత ఏడాదిన్నర కాలంగా మణిపూర్(Manipoor) లో ఏదోకరకమైన అల్లర్లు చెలరేగుతూనే ఉన్నాయి. అధికార పార్టీకి చెందిన పలువురు మంత్రులు, ఎమ్మెల్యేల నివాసాలను దుండగులు కాల్చేసిన ఉదంతాలు కోకొల్లలు. తాజాగా సోమవారం మణిపూర్ గవర్నర్ (Manipoor Governor) లక్ష్మణ్ ఆచార్య నివాసానికి అతి దగ్గరలో ఓ గ్రనేడ్ దొరకడం కలకలం సృష్టించింది. సోమవారం ఉదయం ఇంఫాల్(Imfal) లోని ఓ మహిళా కాలేజ్ గేట్ వద్ద లభ్యమైన గ్రనేడ్ గురించి భద్రతా దళాలు ఆరా తీస్తున్నాయి. ఇది గవర్నర్ నివాసానికి కేవలం 200 మీ. దూరంలో ఉంది. గ్రనేడ్ సమాచారం తెలిసిన వెంటనే అప్రమత్తమైన పోలీసులు.. భద్రతా దళాలు గవర్నర్ నివాసానికి మరింత గట్టి పర్యవేక్షణ ఏర్పాటు చేశారు. కాగా గ్రనేడ్ తోపాటు శ్రామిక వర్గాల విద్యార్థుల హక్కులను గౌరవించలంటూ ఓ లేఖ కూడా లభ్యమయినట్టు పోలీసు వర్గాలు తెలిపాయి.  

Tags:    

Similar News