Kerala: జాక్ పాట్ తగలడం అంటే ఇదే.. లాటరీ కొంటే 10 కోట్లు వచ్చాయ్..!
జాక్ పాట్ తగలడం అంటే ఇదే !! 11 మంది మహిళలు కలిసి చెరో రూ.25 పోగేసి రూ. 250తో లాటరీ టికెట్ కొన్నారు.
మలప్పురం : జాక్ పాట్ తగలడం అంటే ఇదే !! 11 మంది మహిళలు కలిసి చెరో రూ.25 పోగేసి రూ. 250తో లాటరీ టికెట్ కొన్నారు. అది కాస్తా తగిలి వాళ్లకు రూ.10 కోట్లు వచ్చాయి.. కేరళలోని మలప్పురం జిల్లా పరప్పణగాడి టౌన్కు చెందిన 11 మంది పేద మహిళలు.. లాటరీ తగలడంతో రాత్రికిరాత్రి కోటీశ్వరులు అయ్యారు. కేరళ లాటరీ డిపార్ట్మెంట్ గత బుధవారం డ్రా తీయగా.. ఈ మహిళలు కొన్న టికెట్కే జాక్పాట్ తగిలింది. ఈ లాటరీ ప్రైజ్ మనీ రూ.10కోట్లు కావడంతో ఆ మహిళల ఆనందానికి అవధి లేకుండా పోయింది.
“మా కుటుంబాల్లో ఆడపిల్లల పెళ్లిళ్లు, అప్పులు, మెడికల్ ట్రీట్మెంట్స్ ఇలా ఆర్థికంగా ఎన్నో సమస్యలున్నాయి. ఈ డబ్బుతో మా సమస్యలు తీరుతాయి’’ అని ఆ మహిళలు చెప్పారు. పరప్పణగాడి టౌన్ మున్సిపాలిటీలో హరిత కర్మ సేన అనే విభాగం ఉంది. ఈ విభాగంలోని సిబ్బంది భూమిలో కలిసిపోని వ్యర్థాలను ఇళ్లు, ఆఫీసుల నుంచి సేకరించి రీసైక్లింగ్ కోసం యూనిట్లకు పంపిస్తారు. ఇప్పుడు లాటరీ తగిలిన 11 మంది మహిళలు కూడా హరిత కర్మ సేనలోని సభ్యులే.