బండారు దత్తాత్రేయ కాన్వాయ్ కి ప్రమాదం

హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ కాన్వాయ్ ప్రమాదానికి గురైంది.

Update: 2024-10-20 16:55 GMT

దిశ, వెబ్ డెస్క్ : హరియాణా(Haryana) గవర్నర్ బండారు దత్తాత్రేయ (Bandaru Datthatreya) కాన్వాయ్ ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో దత్తాత్రేయకు ఎలాంటి గాయాలు కాలేదని సమాచారం. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం రాత్రి హైదరాబాద్ నుంచి హరియాణా వెళ్లేందుకు దత్తాత్రేయ శంషాబాద్ ఎయిర్ పోర్టుకు బయల్దేరారు. కిషన్ గూడ ట్రంపెట్ వంతెన సమీపంలోకి రాగానే.. ఓ కారు సడన్ గా కాన్వాయ్ లోకి వచ్చింది. దీంతో కాన్వాయ్ డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడం వలన.. కాన్వాయ్ లోని వాహనాలు అదుపుతప్పి ఒకదానినొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో దత్తత్రేయకు ఎలాంటి గాయాలు కాలేదు. కాని 3 కార్లు ధ్వంసం కాగా, భద్రతా సిబ్బందికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు జరుపుతున్నారు.


Similar News