భర్త అలా అన్నాడని.. కవల శిశువుల్ని కడతేర్చిన తల్లి

దిశ, నేషనల్ బ్యూరో : జమ్మూకశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో అమానుష ఘటన చోటుచేసుకుంది.

Update: 2024-07-11 18:42 GMT

దిశ, నేషనల్ బ్యూరో : జమ్మూకశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో అమానుష ఘటన చోటుచేసుకుంది. అప్పుడే పుట్టిన నవజాత కవల శిశువుల్ని కన్నతల్లే కర్కశంగా గొంతుకోసి చంపింది. పోలీసులు తొలుత ఆ ఆడశిశువుల తండ్రిని అరెస్టు చేశారు. అయితే ఈ హత్యకు పాల్పడింది సాక్షాత్తూ ఆ పసికందుల తల్లే అని తెలుసుకొని పోలీసులు కూడా షాక్‌కు గురయ్యారు. ఆ పిల్లల తండ్రి మహ్మద్ ఖుర్షీద్‌‌ను విచారించగా మొత్తం వివరాలు బయటికొచ్చాయి. సౌదీ అరేబియాలో పనిచేస్తున్న మహ్మద్ ఖుర్షీద్‌ మూడు నెలల క్రితమే ఇంటికి తిరిగొచ్చాడు.

గురువారం భార్య కవలలకు జన్మనివ్వడంతో తాను వారికి తండ్రిని కాదని చెప్పాడు. భార్యపై అనుమానాన్ని వ్యక్తపరిచాడు. దీంతో భయపడిన ఆ మహిళ నవజాత శిశువులను సమీపంలోని పొలంలోకి తీసుకెళ్లి గొంతు కోసి హత్య చేసి.. అక్కడే పడేసి వచ్చింది. పోలీసులు గట్టిగా నిలదీయగా తానే హత్య చేశానని ఆమె ఒప్పుకుంది. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Similar News