Jammu Kashmir : జమ్మూకాశ్మీర్ లో ఎన్‌కౌంటర్..!

జమ్మూకాశ్మీర్ లోని ఉధంపూర్ జిల్లా బసంత్ గడ్ ప్రాంతంలో ఉగ్రవాదులు - భద్రతా బలగాలకు మధ్య ఎన్‌కౌంటర్ కొనసాగుతోంది.

Update: 2024-08-06 14:40 GMT

దిశ, వెబ్‌డెస్క్ : జమ్మూకాశ్మీర్ లోని ఉధంపూర్ జిల్లా బసంత్ గడ్ ప్రాంతంలో ఉగ్రవాదులు - భద్రతా బలగాలకు మధ్య ఎన్‌కౌంటర్ కొనసాగుతోంది. ముగ్గురు ఉగ్రవాదులు ఆ ప్రాంతంలో ఉన్నట్లు సమాచారం రావడంతో ఇండియన్ ఆర్మీ, రాష్ట్ర పోలీసులు కలిసి ఉగ్రవాదులపై కాల్పులు చేపడుతున్నారు. దీంతో ఆ ప్రాంతం మొత్తాన్ని భద్రతా బలగాలు తమ ఆధీనంలోకి తీసుకున్నారు.ఈ క్రమంలో ఉగ్రవాదులకు, భద్రతా దళాలకు మధ్య కాల్పులు జరుగుతున్నాయి.

కాగా.. నిన్న భద్రతా దళాలు అనంత్ నాగ్ లో ముగ్గురు టెర్రరిస్టులను అరెస్ట్ చేసి, వారి నుంచి మందు గుండు సామాగ్రి, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.ఇందులో ఒక పిస్టల్, ఒక గ్రెనేడ్,IED బాంబులు ఉన్నాయి . కాగా.. వారిని హసన్ పోరా నివాసితులుగా ఆర్మీ అధికారులు గుర్తించారు. అరెస్టయిన వారిని దావుద్ అహమ్మద్ దార్, అహమ్మద్ రేషి , షాహీద్ అహమ్మద్ దార్ లుగా భద్రతా దళాలు గుర్తించాయి.  


Similar News