Nitin Gadkari :టూవీలర్ కొనుగోలు దారులకు నితిన్ గడ్కరీ గుడ్ న్యూస్

హెల్మెట్ల పై డిస్కౌంట్ ఇవ్వాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కీలక సూచన చేశారు.

Update: 2024-09-04 13:15 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : రోడ్డు ప్రమాదాల్లో హెల్మెట్ ధరించని కారణంగా దేశవ్యాప్తంగా అనేకమంది ప్రాణాలు కోల్పోతుండటంపై కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంలో అందరికీ అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ మేరకు ద్విచక్ర వాహన తయారీ దారులు టూవీలర్స్ కొనుగోలుదారులకు డిస్కౌంట్‌లో హెల్మెట్ అందించాలని కోరారు. ఇవాళ ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. సహేతుకమైన ధరలకు హెల్మెట్లు అందించే విషయంలో ఆలోచన చేయాలన్నారు. ఈ నిర్ణయం వాహనదారుల ప్రాణాలను కాపాడటంలో ఉపయోగపడుతుందన్నారు. 2022లో 30వేలమంది బైకర్స్ హెల్మెట్ ఉపయోగించని కారణంగా చనిపోయారని వెల్లడించారు. దేశంలోని ప్రతి తాలుకాలో డ్రైవింగ్ స్కూల్‌ను ప్రారంభించాలన్నది తన ఆశయమని, అలాగే స్కూల్ బస్సులకు పార్కింగ్ ఏర్పాటుకు సంబంధించి ఒక ప్లాన్‌ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. 


Similar News