BREAKING: కేంద్ర బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం ఫిక్స్

కేంద్ర బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. ఈ నెల 22వ తేదీ నుండి బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. కేంద్ర ఆర్థిక శాఖ

Update: 2024-07-06 10:31 GMT

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. ఈ నెల 22వ తేదీ నుండి బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 23వ తేదీన లోక్ సభలో బడ్జెట్ ప్రవేశపెట్టానున్నారు. ఇప్పటికే నిర్మలా సీతారామన్ నేతృత్వంలోని సెంట్రల్ ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్ బడ్జెట్‌పై కసరత్తు పూర్తి చేసింది. బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్‌తో మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ భేటీ అయ్యారు. కాగా, ఈ ఏడాది పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఫిబ్రవరి నెలలో కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో హ్యాట్రిక్ కొట్టిన ఎన్డీఏ కూటమి.. ముచ్చటగా మూడో సారి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలోనే 2024-2025 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టేందుకు సిద్ధమైంది. 


Similar News