Amarnath Yatra: అమర్నాథ్ యాత్రలో విషాదం..
అమర్నాథ్ యాత్రలో విషాదం నెలకొంది.
శ్రీనగర్: అమర్నాథ్ యాత్రలో విషాదం నెలకొంది. 24 గంటల్లోనే ఐదుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో దక్షిణ కాశ్మీర్ హిమాలయాల యాత్రలో ఈ ఏడాది మృతిచెందిన భక్తుల సంఖ్య 19కి చేరినట్టు అధికారులు బుధవారం వెల్లడించారు. యాత్రికులంతా గుండెపోటుతోనే మృతిచెందినట్టు తెలిపారు. తాజా మరణాల్లో పహల్గామ్ వద్ద ముగ్గురు, బాల్టల్ మార్గంలో ఇద్దరు చనిపోయినట్టు వెల్లడించారు.
మృతులు యూపీ, మధ్యప్రదేశ్కు చెందినవారిగా గుర్తించారు. ఆక్సిజన్ స్థాయిలు తగ్గిపోవడంతోనే గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోయినట్టు అధికారులు తెలిపారు. అమర్నాథ్ యాత్ర ప్రారంభమైన నాటి (ఈ నెల 1)నుంచి మంగళవారం వరకు, 1,37,353 మంది యాత్రికులు సహజంగా ఏర్పడిన మంచు లింగాన్ని వీక్షించేందుకు గుహ మందిరాన్ని సందర్శించారని వివరించారు.